BREAKING
రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు
www.ntodaynews.com

అమరావతి: ఆయుష్‌కు భారీ ఊతం.. రూ.185.75 కోట్ల వార్షిక ప్రణాళికకు కేంద్రం ఆమోదం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 09:11 PM
10 వీక్షణలు

అమరావతి: ఆయుష్‌కు భారీ ఊతం.. రూ.185.75 కోట్ల వార్షిక ప్రణాళికకు కేంద్రం ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ఆయుష్ రంగానికి భారీ ప్రోత్సాహం లభించింది. మంత్రి సత్యకుమార్ చొరవతో రాష్ట్ర ఆయుష్ శాఖకు రూ.185.75 కోట్లతో రూపొందించిన వార్షిక ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ ఆయుష్ చరిత్రలో ఇదే తొలిసారి ఇంత భారీ స్థాయిలో వార్షిక ప్రణాళికకు అనుమతి లభించింది.

2024-25 నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరాల వరకు ఆయుష్ అభివృద్ధి కోసం మొత్తం రూ.434 కోట్ల కేటాయింపులకు కేంద్రం ఆమోదం తెలిపింది. గతంలో 2014-15 నుంచి 2023-24 వరకు పదేళ్ల కాలంలో ఆయుష్ రంగానికి కేవలం రూ.120.17 కోట్ల మేర మాత్రమే కేటాయింపులు జరిగాయి.

కొత్తగా ఆమోదించిన నిధులతో ఆయుష్ వైద్య సేవల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సంప్రదాయ వైద్య సేవలు అందించే కార్యక్రమాలకు మరింత ఊతం లభించనుంది. రాష్ట్రంలో ఆయుష్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.