BREAKING
ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ! సంగారెడ్డి: రూ.500 కోసం తండ్రి గొంతు కోసిన కొడుకు నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ! సంగారెడ్డి: రూ.500 కోసం తండ్రి గొంతు కోసిన కొడుకు నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత
www.ntodaynews.com

ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
pammi naveenkumar రావులపాలెం మండల ప్రతినిధి
20 Aug, 2026 - 09:54 PM
32 వీక్షణలు

ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు

ధర్మమే గెలిచింది దుర్మార్గం ఓడింది ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరుఅక్రమ కేసులతో అణగదొక్కాలనుకున్న కూటమి ప్రభుత్వానికి కోర్టు తీర్పుతో చెంపపెట్టుఆలమూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తమ్మన శ్రీనివాస్ గారికి ఈరోజు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అక్రమంగా అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించినప్పటికీ, న్యాయస్థానంలో జరిగిన విచారణ అనంతరం ఆయనకు బెయిల్ లభించడం ధర్మం గెలిచిందనడానికి నిదర్శనమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు.తమ్మన శ్రీనివాస్ గారిపై అక్రమంగా కేసులు బనాయించి, ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నించిందని పార్టీ నాయకులు ఆరోపించారు. అయితే న్యాయస్థానం ముందు వాస్తవాలు వెలుగులోకి రావడంతో తమ్మన శ్రీనివాస్ గారికి బెయిల్ మంజూరు కావడం ద్వారా న్యాయంపై తమకు ఉన్న నమ్మకం మరింత బలపడిందన్నారు.తమ్మన శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపిన సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారురాజకీయంగా చురుకుగా పనిచేస్తున్న నాయకుడిని అక్రమ కేసులతో అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని అప్పట్లోనే పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది.తమ్మన శ్రీనివాస్ గారు ఎలాంటి తప్పు చేయలేదనే నమ్మకంతో ధైర్యంగా చట్టాన్ని, న్యాయవ్యవస్థను ఆశ్రయించారు. చివరకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో న్యాయపరమైన పోరాటంలో తొలి విజయం సాధించినట్లయిందని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.కేసులు, అరెస్టులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టడం సాధ్యం కాదని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే ప్రతి నాయకుడికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.తమ్మన శ్రీనివాస్ గారి అరెస్టు సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ నాయకులు అండగా నిలిచారని, జైల్లో ములాఖత్‌లో ఆయనను కలిసి ధైర్యం చెప్పడంతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు బెయిల్ లభించడంతో తమ్మన శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమవుతోందితమ్మన శ్రీనివాస్ గారికి బెయిల్ రావడం కేవలం ఒక నాయకుడికి లభించిన న్యాయపరమైన ఉపశమనం మాత్రమే కాదని, అక్రమ కేసులతో రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కాలనే ప్రయత్నాలకు న్యాయవ్యవస్థ ఇచ్చిన సమాధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివర్ణించారు.ధర్మం, న్యాయం ఎప్పటికైనా గెలుస్తాయని మరోసారి రుజువైందని అన్నారు. తప్పుడు కేసులు, రాజకీయ వేధింపులు, అక్రమ అరెస్టులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నిలువరించడం ఎవరి వల్లా కాదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై, ప్రజల హక్కుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారుతమ్మన శ్రీనివాస్ గారికి బెయిల్ మంజూరు కావడంతో ఆలమూరు మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. “ధర్మమే గెలిచింది.. దుర్మార్గం ఓడింది.. న్యాయమే నిలిచింది” అంటూ పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.