గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి:
చిలకలూరిపేట | NTODAY NEWS
చిలకలూరిపేట నియోజకవర్గంలోని గణపవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సీతారాంబ తల్లి (బొడ్రాయి) 15వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, భక్తులకు స్వయంగా అన్నదాన వితరణ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, శ్రీ సీతారాంబ తల్లి అనుగ్రహంతో ప్రతి కుటుంబంలో ఐకమత్యం, సుఖశాంతులు నెలకొనాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తే ప్రజలందరికీ సకల శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.