BREAKING
పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
www.ntodaynews.com

కరీంనగర్‌లో మరోసారి ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 08:10 PM
51 వీక్షణలు

కరీంనగర్‌లో మరోసారి ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డిపోలో పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఇటీవల తిమ్మాపూర్‌లో జరిగిన ఎలక్ట్రిక్ బస్సు అగ్నిప్రమాదంపై ఇంకా స్పష్టత రాకముందే మరో ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన జేబీఎం సంస్థ నిపుణుల బృందం ఇప్పటికీ పూర్తి నివేదికను వెల్లడించలేదు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2024 అక్టోబర్‌లో జేబీఎం సంస్థ నుంచి ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసింది. అయితే వరుసగా మూడోసారి అగ్నిప్రమాదం జరగడంతో ఈ బస్సుల నాణ్యత, భద్రతా ప్రమాణాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా ఘటన నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల ఆపరేషన్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఘటనకు గల కారణాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రజలు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.