BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

కరీంనగర్‌లో మరోసారి ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 08:10 PM
159 వీక్షణలు

కరీంనగర్‌లో మరోసారి ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డిపోలో పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఇటీవల తిమ్మాపూర్‌లో జరిగిన ఎలక్ట్రిక్ బస్సు అగ్నిప్రమాదంపై ఇంకా స్పష్టత రాకముందే మరో ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన జేబీఎం సంస్థ నిపుణుల బృందం ఇప్పటికీ పూర్తి నివేదికను వెల్లడించలేదు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2024 అక్టోబర్‌లో జేబీఎం సంస్థ నుంచి ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసింది. అయితే వరుసగా మూడోసారి అగ్నిప్రమాదం జరగడంతో ఈ బస్సుల నాణ్యత, భద్రతా ప్రమాణాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా ఘటన నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల ఆపరేషన్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఘటనకు గల కారణాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రజలు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.