BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

యాప్‌లు కాదు.. యూరియా కావాలి.. సీఎం సవాల్‌కు సిద్ధం: కేటీఆర్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 07:46 PM
56 వీక్షణలు

ముఖ్యమంత్రి చేసిన సవాల్‌కు తాను సిద్ధంగా ఉన్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తమ పార్టీ తరఫున తానే చర్చకు వస్తానని చెప్పారు.

అశోక్‌నగర్‌లో ఉద్యోగాల అంశంపైనా, వరంగల్ రైతు డిక్లరేషన్‌పైనా చర్చకు సిద్ధమని పేర్కొన్న కేటీఆర్.. టాపిక్, తేదీ, స్థలం, సమయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకోవచ్చన్నారు.

ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలను నిరూపించలేకపోతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. సవాల్ చేసి వెనక్కి తగ్గడం రేవంత్ రెడ్డికి అలవాటని విమర్శించారు.

ప్రభుత్వం సభలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించిన కేటీఆర్.. రైతులకు యాప్‌లు కాదు, యూరియా ఎరువులు కావాలని వారు కోరుతున్నారని అన్నారు.