BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

తెలంగాణలో కొత్తగా 121 మద్యం బ్రాండ్లు.. 18 కంపెనీలకు అనుమతుల ప్రక్రియ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 12:38 PM
24 వీక్షణలు

తెలంగాణలో కొత్తగా 121 మద్యం బ్రాండ్లు.. 18 కంపెనీలకు అనుమతుల ప్రక్రియ

హైదరాబాద్‌ : తెలంగాణలో మద్యం వినియోగదారులకు కొత్త బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 121 మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు ప్రక్రియ వేగవంతమైంది. ఈ మేరకు 18 మద్యం సరఫరా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నట్లు ఎక్సైజ్‌ శాఖ వెల్లడించింది.

కొత్తగా మార్కెట్‌లోకి రాబోతున్న బ్రాండ్లలో పలు రకాల బీర్లు, విస్కీ, వైన్‌, వోడ్కా, బ్రాందీ, జిన్‌, టకీలా వంటి మద్యం రకాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. చీతా, టైగర్‌, రెడ్‌ హార్స్‌, అబెస్ట్‌, ఫ్లెన్స్‌బర్గర్‌, భూటానిస్‌, కకావోస్‌ వంటి పేర్లతో బీర్లు కూడా జాబితాలో ఉన్నాయి.

కొత్త బ్రాండ్లకు సంబంధించి పారదర్శకత కోసం ఎక్సైజ్‌ శాఖ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ బ్రాండ్లు, సరఫరాదారులపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్‌ 1వ తేదీ లోపు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

అభ్యంతరాల పరిశీలన పూర్తయిన అనంతరం అర్హత సాధించిన బ్రాండ్లకు తుది అనుమతులు ఇచ్చి రాష్ట్రంలోని మద్యం దుకాణాల ద్వారా విక్రయాలు ప్రారంభించే అవకాశం ఉంది. కొత్త బ్రాండ్ల రాకతో మార్కెట్‌లో పోటీ పెరగడంతో పాటు వినియోగదారులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి.