BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

హైదరాబాద్‌లో బంగారం ధరలకు భారీ పెరుగుదల.....

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 12:39 PM
11 వీక్షణలు

హైదరాబాద్‌లో బంగారం ధరలకు భారీ పెరుగుదల.. రూ.1.63 లక్షలకు చేరిన పసిడి 

హైదరాబాద్, ఆగస్టు 24: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పసిడి ధరలు ఆకాశాన్నంటుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, పెట్టుబడిదారుల డిమాండ్ కారణంగా బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగుతోంది. 

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.880 పెరిగి రూ.1,63,970కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.800 పెరిగి రూ.1,50,300 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి ధరలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. కిలో వెండి ధర రూ.2,69,900 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నగరాలు, స్థానిక మార్కెట్లను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

బంగారం ధరలు వరుసగా పెరుగుతుండటంతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం కొనుగోలు చేసే కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. మరోవైపు పెట్టుబడి సాధనంగా బంగారంపై ఆసక్తి పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది.