BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ఎ. కొండూరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఐ కె. గిరిబాబు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 07:46 PM
75 వీక్షణలు

ఎన్‌టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఎ. కొండూరు పోలీస్ స్టేషన్‌ను తిరువూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. గిరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని పరిపాలనా విధానాలు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసులు, కేసు డైరీలు, ఇతర అధికారిక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

దర్యాప్తు పనులు చట్టబద్ధంగా, సమయపాలనతో కొనసాగించేలా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, రోడ్డు భద్రతా నిబంధనలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

అలాగే గ్రామాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వారి ఫిర్యాదులను సత్వరమే నమోదు చేసి, చట్టపరమైన చర్యలు వేగంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్న సీఐ కె. గిరిబాబు, స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి. మహాలక్ష్ముడు మరియు పోలీసు సిబ్బంది పనితీరును అభినందించారు. స్టేషన్ పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇదే ఉత్సాహంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.