BREAKING
పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
www.ntodaynews.com

ఎ. కొండూరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఐ కె. గిరిబాబు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 07:46 PM
14 వీక్షణలు

ఎన్‌టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఎ. కొండూరు పోలీస్ స్టేషన్‌ను తిరువూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. గిరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని పరిపాలనా విధానాలు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసులు, కేసు డైరీలు, ఇతర అధికారిక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

దర్యాప్తు పనులు చట్టబద్ధంగా, సమయపాలనతో కొనసాగించేలా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, రోడ్డు భద్రతా నిబంధనలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

అలాగే గ్రామాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వారి ఫిర్యాదులను సత్వరమే నమోదు చేసి, చట్టపరమైన చర్యలు వేగంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్న సీఐ కె. గిరిబాబు, స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి. మహాలక్ష్ముడు మరియు పోలీసు సిబ్బంది పనితీరును అభినందించారు. స్టేషన్ పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇదే ఉత్సాహంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.