BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

వి.బి. జిరామ్‌జీ పథకాన్ని రద్దు చేయాలి – ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఏ చట్టాన్ని పునరుద్ధరించాలి: వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 07:46 PM
69 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని ఉపాధి హామీ పని ప్రాంతాల్లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు వి. నాగరాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు వి.బి. జిరామ్‌జీ పేరుతో కొత్త విధానాన్ని తీసుకువస్తోందని ఆరోపించారు.

ఉపాధి హామీ చట్టం అమలును బలహీనపర్చే ప్రయత్నాల్లో భాగంగానే ఈ కొత్త విధానం ఉందని, రెండు ఫోటోల విధానం కూడా అదే కుట్రలో భాగమని ఆయన పేర్కొన్నారు. ఉపాధి కూలీలు ఐక్యంగా పోరాడి ఈ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

అనంతరం విస్సన్నపేట, కొండపర్వ, తాతకుంట్ల గ్రామాల్లో ఉపాధి కూలీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తర్వాత ఏపీఓ రామారావుకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకుడు మేకల జ్ఞానరత్నం, సీఐటీయూ మండల కన్వీనర్ ఆకుల శ్రీనివాసరావు, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.