BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

వి.బి. జిరామ్‌జీ పథకాన్ని రద్దు చేయాలి – ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఏ చట్టాన్ని పునరుద్ధరించాలి: వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 07:46 PM
39 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని ఉపాధి హామీ పని ప్రాంతాల్లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు వి. నాగరాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు వి.బి. జిరామ్‌జీ పేరుతో కొత్త విధానాన్ని తీసుకువస్తోందని ఆరోపించారు.

ఉపాధి హామీ చట్టం అమలును బలహీనపర్చే ప్రయత్నాల్లో భాగంగానే ఈ కొత్త విధానం ఉందని, రెండు ఫోటోల విధానం కూడా అదే కుట్రలో భాగమని ఆయన పేర్కొన్నారు. ఉపాధి కూలీలు ఐక్యంగా పోరాడి ఈ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

అనంతరం విస్సన్నపేట, కొండపర్వ, తాతకుంట్ల గ్రామాల్లో ఉపాధి కూలీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తర్వాత ఏపీఓ రామారావుకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకుడు మేకల జ్ఞానరత్నం, సీఐటీయూ మండల కన్వీనర్ ఆకుల శ్రీనివాసరావు, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.