www.ntodaynews.com
విద్యార్థి నిజాయితీకి ప్రశంసలు.. బంగారు మంగళసూత్రాన్ని పోలీసులకు అప్పగించిన సాల్మన్
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఇబ్రహీంపట్నానికి చెందిన విద్యార్థి సాల్మన్కు ఓ బంగారు మంగళసూత్రం దొరికింది. దానిని తన వద్ద ఉంచుకోకుండా వెంటనే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు.
విద్యార్థి చూపిన నిజాయితీ, బాధ్యతాయుతమైన వ్యవహారాన్ని ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం అభినందించారు. సమాజంలో ఇటువంటి నిజాయితీ గల యువత ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు.