BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల.. 6.39 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 06:21 PM
86 వీక్షణలు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త అందించింది. రైతు భరోసా పథకం కింద మూడో విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది. 3 నుంచి 4 ఎకరాల భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,330 కోట్లను జమ చేసినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 6.39 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రైతు భరోసా పథకం ద్వారా మొత్తం 61.35 లక్షల మంది రైతులకు రూ.5,402.37 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించినట్లు పేర్కొన్నారు.

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, సాగు ఖర్చులను తగ్గించడం, రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే రైతు భరోసా పథకం ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే నిధులు జమ చేస్తున్నట్లు చెప్పారు.

రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్న ప్రభుత్వం, వ్యవసాయాభివృద్ధి కోసం మరిన్ని సంక్షేమ చర్యలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.