శంకర్ బ్రిడ్జి నిర్మాణం వలన ఉపాధి కోల్పోతున్న షాపు ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలి సిఐటియు
గుంటూరు నగర షాప్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో నేడు లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి తదుపరి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ గాయత్రీ దేవి గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగినది .ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులుకే శ్రీనివాసరావు సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకర విలాస్ సెంటర్లో బ్రిడ్జి నిర్మించడంలో భాగంగా ఆ పరిసర ప్రాంతంలో వివిధ షాపులలో పనిచేస్తున్న షాపు ఉద్యోగులకు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. ఈ విధంగా ఉపాధి కోల్పోయిన వారికి 2013 భూ సేకరణ చట్టం కారం షాపు యజమానులతో పాటు అందులో పని చేస్తున్న సేల్స్ మెన్స్, గుమ్మస్తాలు, సూపర్వైజర్లు, అందరికీ ప్రభుత్వం వైపు నుంచి పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా నిర్మించడానికి ముందుగా రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మిస్తే ఇటు ప్రయాణికులకు అటు షాపు యజమానులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. అలా కాకుండా నిర్మించడం వలన గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లేవారు, కోర్టు కాంపౌండ్ కు వెళ్లేవారు, మెడికల్ కాలేజీకి వెళ్లేవారు హిందూ కాలేజీ కూడలి దాకా వెళ్లి తిరిగి రావాల్సి వస్తుందని ఆయన అన్నారు. ముందుగా ఆర్ యు బి నిర్మించడం వలన వాహనదారులతో పాటు షాపు వ్యాపారులకి అందులో పని చేస్తున్న ఉద్యోగులకి ఉపయోగకరం గా ఉంటుందని ఆయన అన్నారు. సర్వీస్ రోడ్లు తగినంతగా లేకపోవడం వలన అటు వాహనదారులు ఇటు వ్యాపారస్తులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, పూర్ణచంద్రరావు, గోపి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.