www.ntodaynews.com
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం
తెలంగాణ
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. భర్త మహిపాల్ను భార్య స్వరూప తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మహిపాల్ మృతి గుండెపోటుతో జరిగిందని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ, మృతదేహంపై మెడ వద్ద గాయాల ఆనవాళ్లు కనిపించడంతో బంధువులకు అనుమానం కలిగింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు స్వరూపను అదుపులోకి తీసుకుని విచారించగా, హత్యకు సంబంధించిన విషయాలు బయటపడ్డాయి. అనంతరం స్వరూపతో పాటు ఆమె ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.