www.ntodaynews.com
హనుమకొండ జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్తో నవ వరుడు, తండ్రి మృతి
తెలంగాణ
/
హన్మకొండ
హనుమకొండ జిల్లా భీమారంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి అలంకరణ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ను పరిశీలిస్తున్న సమయంలో విద్యుత్ షాక్కు గురై తండ్రి, కుమారుడు మృతి చెందారు.
వివరాల ప్రకారం, ఇంటి వద్ద ఏర్పాటు చేసిన అలంకరణ లైటింగ్ వైర్లను తాకడంతో సాంబయ్య (62) విద్యుదాఘాతానికి గురయ్యారు. తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన కుమారుడు శరత్ (32) కూడా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడు శరత్ ఇటీవలే, జూన్ 24న వివాహం చేసుకున్నాడు. ఆయన హైదరాబాద్లో చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నట్లు సమాచారం.
పెళ్లి వేడుకలు ముగిసిన కొద్ది రోజులకే తండ్రి, కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.