www.ntodaynews.com
డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఘన సన్మానం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
డాక్టర్స్ డే సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన క్యాంపు కార్యాలయంలో వైద్యులకు ఘన సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజ ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమైందని, ప్రజలకు నిత్యం అందిస్తున్న వారి అంకితభావ సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్న వైద్యులను శాలువాలతో సత్కరించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైద్యులు, హెచ్డీఎస్ సభ్యులు, యూపీహెచ్సీ చైర్మన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
డాక్టర్స్ డే సందర్భంగా సేవామూర్తులైన వైద్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.