BREAKING
292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి
www.ntodaynews.com

రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయండి నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న ఆదేశం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 10:54 AM
20 వీక్షణలు


చాట్రాయి, జులై 3: రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి పూర్తయిన గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సిద్ధం కావాలని నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రీ సర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో 60 శాతానికి పైగా ప్రక్రియ పూర్తయిన రైతుల జాబితాను సిద్ధం చేసి, వారికి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సూచించారు. జులై నెలలోనే రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.

రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాల్లో రీ సర్వేకు సంబంధించి నిర్లక్ష్యం లేదా ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు.

ఈ సమావేశంలో తహసీల్దార్ శ్వేత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, గ్రామ రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.