BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయండి నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న ఆదేశం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 10:54 AM
88 వీక్షణలు


చాట్రాయి, జులై 3: రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి పూర్తయిన గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సిద్ధం కావాలని నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రీ సర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో 60 శాతానికి పైగా ప్రక్రియ పూర్తయిన రైతుల జాబితాను సిద్ధం చేసి, వారికి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సూచించారు. జులై నెలలోనే రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.

రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాల్లో రీ సర్వేకు సంబంధించి నిర్లక్ష్యం లేదా ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు.

ఈ సమావేశంలో తహసీల్దార్ శ్వేత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, గ్రామ రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.