BREAKING
292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి
www.ntodaynews.com

చాట్రాయిలో ఉచిత క్యాన్సర్ శిబిరానికి విశేష స్పందన.. 150 మందికి పైగా వైద్య పరీక్షలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 10:54 AM
21 వీక్షణలు

చాట్రాయి, జులై 2: గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో రోటరీ క్లబ్ నూజివీడు టౌన్, రోటరీ కమ్యూనిటీ సర్వీసెస్ నూజివీడు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నిపుణులైన వైద్య బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 150 మందికి పైగా ప్రజలు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.

ఉదయం నుంచే శిబిరం వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యాన్సర్‌కు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు, వ్యాధి లక్షణాలు, జాగ్రత్తలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అవసరమైన వారికి తదుపరి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ ప్రత్యేక సలహాలు అందించారు.

క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయిలో నయం చేసే అవకాశాలు అధికంగా ఉంటాయని వైద్య నిపుణులు తెలిపారు. జీవనశైలిలో మార్పులు, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, సరైన ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం, ముందస్తు పరీక్షల ద్వారా ప్రాణాపాయ పరిస్థితులను నివారించడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ప్రజల నుంచి లభించిన విశేష స్పందన తమకు మరింత సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రేరణనిచ్చిందన్నారు.

ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు బోయపాటి ముఖర్జీ, శశికాంత్, ఎం. శ్రీనివాస్, మండా శ్రీనివాసరావు, యార్లగడ్డ రాజగోపాల్, పైడి అనిల్ కుమార్, శోభనాద్రి తదితరులు పాల్గొన్నారు. బసవతారకం ఆసుపత్రికి చెందిన డాక్టర్ రవి సుకుమార్, డాక్టర్ శ్రీవల్లి, డాక్టర్ సురేఖ తదితరులు వైద్య సేవలు అందించి శిబిరాన్ని విజయవంతం చేశారు.