www.ntodaynews.com
కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు
తెలంగాణ
రాష్ట్ర కేబినెట్ సమావేశానికి అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరుకాలేదు. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చినప్పటికీ ఆమె సమావేశానికి దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
యాదగిరిగుట్ట నూతన దేవస్థాన పాలక మండలి బోర్డు ఏర్పాటు విషయంలో మంత్రి కొండా సురేఖ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆమె విదేశాల్లో ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పాలక మండలి బోర్డును ప్రకటించారు.
తనతో సంప్రదింపులు జరపకుండా బోర్డు ఏర్పాటు చేయడంపై మంత్రి కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదన్న చర్చ సాగుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం లేదా మంత్రి కొండా సురేఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.