రైతు భరోసా డబ్బులు పడ్డాయా?.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న రైతు భరోసా నిధుల స్థితిని రైతులు అధికారిక వెబ్సైట్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
స్టేటస్ చెక్ చేసేందుకు https://rythubharosa.telangana.gov.in వెబ్సైట్లోకి వెళ్లి "Know Your Bharosa Status" ఆప్షన్పై క్లిక్ చేయాలి. అనంతరం ఆధార్ నంబర్ లేదా పట్టాదార్ పాస్బుక్ నంబర్ నమోదు చేసి, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తే చెల్లింపు వివరాలు తెరపై కనిపిస్తాయి.
అలాగే బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చిన డీబీటీ (DBT) సందేశం ద్వారా కూడా రైతు భరోసా నిధులు జమయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. గూగుల్ పే, ఫోన్పే, యోనో వంటి బ్యాంకింగ్ యాప్లలో మినీ స్టేట్మెంట్ చూసి కూడా డబ్బులు జమ అయిన విషయాన్ని నిర్ధారించుకోవచ్చు.
ఒకవేళ చెల్లింపు పెండింగ్లో ఉంటే లేదా వివరాలు కనిపించకపోతే సంబంధిత గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.