www.ntodaynews.com
చనుబండలో విస్సంపల్లి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామ మాజీ సర్పంచ్ విస్సంపల్లి జ్యోతి కుటుంబంలో విషాదం నెలకొంది. జ్యోతి బావగారు విస్సంపల్లి రాంబాబు ఇటీవల అనారోగ్యంతో మరణించారు.
ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, రాంబాబు మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వనమా వాసు తదితరులు పాల్గొన్నారు