BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.200 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 07:10 AM
73 వీక్షణలు

హైదరాబాద్‌లో సీఐడీ డీఎస్పీ భీంరెడ్డి నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన సోదాల్లో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. సోదాల సందర్భంగా అధికారులు ఒక డైరీని స్వాధీనం చేసుకోగా, అందులో 15 మంది బినామీల పేర్లు నమోదు చేసినట్లు గుర్తించారు.

ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో భీంరెడ్డికి సంబంధించిన సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించినట్లు సమాచారం. మొత్తం 16 ప్రాంతాల్లో ఆయనకు ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించారు.

అలాగే ఆయన నివాసంలో కేజీ బంగారం, రూ.40 లక్షల నగదు లభ్యమవగా, వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో విదేశీ మద్యం బాటిళ్లను కూడా గుర్తించినట్లు సమాచారం.

భీంరెడ్డి 1995లో ఎస్సైగా పోలీస్ శాఖలో చేరారు. అనంతరం సీఐగా పదోన్నతి పొంది రాయదుర్గం, వనస్థలిపురం, చిక్కడపల్లి తదితర పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. డీఎస్పీగా ప్రమోషన్ పొందిన తర్వాత పటాన్‌చెరు డివిజన్‌లో పనిచేసి, ప్రస్తుతం సీఐడీ డీఎస్పీగా కొనసాగుతున్నారు.

ఇదిలా ఉండగా, గతంలో పలు వివాదాస్పద అంశాల్లో ఆయన పేరు వినిపించిందని, అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాల్లో ఆయన ఆస్తుల వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

భీంరెడ్డి బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ ఛైర్మన్ నరేందర్‌రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేపట్టారు. భీంరెడ్డి, నరేందర్‌రెడ్డి కలిసి వ్యాపారాలు నిర్వహించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.