BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

అనకాపల్లి జిల్లాలో దారుణం.. భార్య, ప్రియుడి పక్కా ప్రణాళికతో భర్త హత్య?

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 06:23 AM
112 వీక్షణలు

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం శ్రీరాంపురం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దారపురెడ్డి అప్పలనాయుడు (38) అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.

అప్పలనాయుడికి సుమారు 11 ఏళ్ల క్రితం ఎస్.కోట మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన హైమతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు అనూష, యోక్షిత ఉన్నారు. హైమ ప్రస్తుతం శ్రీరాంపురం గ్రామంలో వెలుగు వీఓఏగా పనిచేస్తోంది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, హైమకు కె.కోటపాడు మండలం జోగన్నపాలెంకు చెందిన బండారు గంగాధర్‌తో గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు హైమను విచారిస్తున్నారు.

బుధవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత అప్పలనాయుడిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రియుడి ప్రణాళిక మేరకే ఈ హత్య జరిగిందా? మరెవరైనా సహకరించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఘటన అనంతరం బండారు సత్యనారాయణ పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

సంఘటన స్థలాన్ని కె.కోటపాడు సీఐ కె.కృష్ణ, ఎస్ఐ వి.సత్యనారాయణ, క్లూస్ టీం ఇన్స్పెక్టర్ విజయ, ఎస్ఐ లక్ష్మీనరసింహ పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలించారు.

మృతుడి అన్నయ్య దారపురెడ్డి ఎర్రినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.