BREAKING
292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి
www.ntodaynews.com

అనకాపల్లి జిల్లాలో దారుణం.. భార్య, ప్రియుడి పక్కా ప్రణాళికతో భర్త హత్య?

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 06:23 AM
33 వీక్షణలు

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం శ్రీరాంపురం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దారపురెడ్డి అప్పలనాయుడు (38) అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.

అప్పలనాయుడికి సుమారు 11 ఏళ్ల క్రితం ఎస్.కోట మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన హైమతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు అనూష, యోక్షిత ఉన్నారు. హైమ ప్రస్తుతం శ్రీరాంపురం గ్రామంలో వెలుగు వీఓఏగా పనిచేస్తోంది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, హైమకు కె.కోటపాడు మండలం జోగన్నపాలెంకు చెందిన బండారు గంగాధర్‌తో గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు హైమను విచారిస్తున్నారు.

బుధవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత అప్పలనాయుడిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రియుడి ప్రణాళిక మేరకే ఈ హత్య జరిగిందా? మరెవరైనా సహకరించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఘటన అనంతరం బండారు సత్యనారాయణ పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

సంఘటన స్థలాన్ని కె.కోటపాడు సీఐ కె.కృష్ణ, ఎస్ఐ వి.సత్యనారాయణ, క్లూస్ టీం ఇన్స్పెక్టర్ విజయ, ఎస్ఐ లక్ష్మీనరసింహ పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలించారు.

మృతుడి అన్నయ్య దారపురెడ్డి ఎర్రినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.