BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

జులై 16, 17, 18 తేదీల్లో 'తల్లికి వందనం' డబ్బులు జమ: మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 04:49 PM
84 వీక్షణలు

అమరావతి, జులై 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం కింద రెండో విడత నిధులను జులై 16, 17, 18 తేదీల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లు నిర్వహించి, అదే సమయంలో నిధుల విడుదల ప్రక్రియ చేపడతామని తెలిపారు.

విద్యాభివృద్ధి, విద్యార్థుల హాజరు పెంపు లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా వేలాది మంది తల్లులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అదే విధంగా, జులై 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాల అమలుపై ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు లోకేశ్ వెల్లడించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని మంత్రి లోకేశ్ సూచించారు.