BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బలివాడ కాంతారావు జయంతి ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 12:32 PM
88 వీక్షణలు

గంపలగూడెం, జూలై 3: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను ప్రాథమిక బీసీ పాఠశాలలో శుక్రవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బలివాడ కాంతారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరసవెల్లి అనూష మాట్లాడుతూ బలివాడ కాంతారావు తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచిన మహోన్నత రచయిత అని పేర్కొన్నారు. ఆయన 38 నవలలు, 400కు పైగా చిన్నకథలు, 8 నాటకాలు, యాత్ర కథనాలు, వ్యాసాలు రచించి తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందించారని తెలిపారు.

అలాగే ఆయన రచించిన "పుణ్యభూమి" నవలకు 1972లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందని, "బలివాడ కాంతారావు కథలు" కథా సంకలనానికి 1988లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కిందని చెప్పారు. సాహిత్య రంగంలో ఆయన అందించిన సేవలకు అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, సన్మానాలు లభించాయని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సహకార సంఘం మాజీ అధ్యక్షులు నంబూరి శ్రీనివాసరావు, శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు, సీఆర్పీ సంగెపు చిన్న నరసింహారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.