BREAKING
292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి
www.ntodaynews.com

బూరుగుగూడెంలో దెబ్బతిన్న డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేసిన స్పెషల్ ఆఫీసర్ మాసగిరి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 02:30 PM
21 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలోని బీసీ ఏరియా రేషన్ షాపు వద్ద డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని మురుగునీరు ఆర్ అండ్ బి రోడ్డుపైకి పొంగిపొర్లుతోంది. రోజుల తరబడి మురుగునీరు రోడ్డుపై నిల్వ ఉండటంతో రహదారి క్రమంగా దెబ్బతింటూ చెరువును తలపించేలా మారింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, గ్రామ ప్రజలు పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఈ పరిస్థితిని గమనించిన పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మాసగిరి శ్రీనివాసరావు ఘటన స్థలాన్ని పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ నిర్లక్ష్యంతో రహదారి ధ్వంసమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని పంచాయతీ కార్యదర్శి రాజగోపాల్‌ను ఆదేశించారు. ఇకపై ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే అంశాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.