www.ntodaynews.com
పర్వతాపురం రైతులకు కీలక ప్రకటన – రేపటి నుంచి ఈ-కేవైసీ ప్రక్రియ ప్రారంభం తహశీల్దార్ జి. శ్వేత
ఆంధ్రప్రదేశ్
/
కర్నూలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో భూములు కలిగిన రైతులు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పొందేందుకు తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ పూర్తి చేయాలని చాట్రాయి తహశీల్దార్ జి.శ్వేత సూచించారు.
ఈ మేరకు రేపు ఉదయం 9.00 గంటల నుంచి పర్వతాపురం గ్రామ పంచాయతి కార్యాలయంలోను, మరియు బూరుగుగూడెం సచివాలయంలోను ఈ-కేవైసీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామానికి చెందిన భూయజమానులు తమ ఆధార్ కార్డు, సంబంధిత భూ పత్రాలతో హాజరై ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.
అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త పట్టాదారు పాసుపుస్తకాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని తహశీల్దార్ జి.శ్వేత విజ్ఞప్తి చేశారు.