www.ntodaynews.com
శంషాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం
అంతర్జాతీయం
అంతర్జాతీయం
TG: హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్కు బయలుదేరాల్సిన విమానంలో టేకాఫ్కు ముందు సాంకేతిక లోపం గుర్తించారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని నిలిపివేసి, అందులో ఉన్న సుమారు 150 మంది ప్రయాణికులను సురక్షితంగా దించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎయిర్లైన్స్ సంస్థ హోటల్ బసతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేసింది. విమానంలోని సాంకేతిక లోపాన్ని ఇంజినీరింగ్ బృందం పరిశీలిస్తోంది.