మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక
టెహ్రాన్: అమెరికాపై ఇరాన్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇజ్రాయెల్ను ఉద్దేశిస్తూ "మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. లేదంటే తగిన బుద్ధి చెబుతాం" అంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి ఘాటుగా హెచ్చరించారు. ఇరాన్పై లేదా తమ దేశ నాయకత్వంపై ఎలాంటి బెదిరింపులు వచ్చినా వెంటనే గట్టి ప్రతిస్పందన ఇస్తామని స్పష్టం చేశారు.
ఇటీవల చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఇరాన్ సుప్రీం నాయకుడు మరణశిక్షకు అర్హుడని కాట్జ్ వ్యాఖ్యానించడంతో టెహ్రాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన అరాగ్చీ.. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు కుదిరిన 14 అంశాల అవగాహనా ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ చర్యలను అమెరికా నియంత్రించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఒకవేళ అమెరికా తన ప్రభావాన్ని ఉపయోగించకపోతే, ఇజ్రాయెల్కు ఇరానే తగిన సమాధానం చెబుతుందని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య లో కీలక దౌత్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా భద్రత, కాల్పుల విరమణ కొనసాగింపు, ప్రాంతీయ ఉద్రిక్తతల నివారణ వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ చర్చలకు , మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.
మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఇరాన్ తాజా హెచ్చరికలు ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.