www.ntodaynews.com
వెనుజులాను వణికించిన భూకంపాలు.. 2 వేల దాటనున్న మృతుల సంఖ్య!
అంతర్జాతీయం
దక్షిణ అమెరికా దేశమైన వెనుజులాలో సంభవించిన భారీ భూకంపాల కారణంగా ప్రాణనష్టం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు దాదాపు 2 వేల మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 10,571 మంది గాయపడగా, సుమారు 50 వేల మంది ఆచూకీ తెలియకుండా గల్లంతైనట్లు సమాచారం.
భూకంపాల ధాటికి 58 వేలకుపైగా భవనాలు దెబ్బతిన్నాయి. వాటిలో 189 భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద ఇంకా వేలాది మంది చిక్కుకుని ఉండొచ్చనే అనుమానాలతో వారం రోజులుగా సహాయక బృందాలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూకంపాలతో వెనుజులాలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.