www.ntodaynews.com
వీడు మనిషి కాదు.. నరమాంస భక్షకుడు! ఆసుపత్రుల నుంచి మానవ అవయవాలు దొంగిలించి వండుకుని తిన్న ఉద్యోగి
అంతర్జాతీయం
హంగేరీ దేశ రాజధాని బుడాపెస్ట్లో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల ఆసుపత్రి ఉద్యోగి నరమాంస భక్షకుడిగా పోలీసులకు చిక్కాడు.
పోలీసుల విచారణలో అతడు ఆసుపత్రులు, శ్మశానవాటికల నుంచి మానవ శరీర భాగాలను దొంగిలించి తన అపార్ట్మెంట్లో దాచుకున్నట్లు, వాటిలో కొన్ని భాగాలను వండుకుని తిన్నట్లు అంగీకరించినట్లు సమాచారం.
నిందితుడి నివాసంలో పోలీసులు మానవ ముఖం, చర్మం, కాలు, చేయి, మెదడు, పుర్రెలు, ఎముకలు, గుండె తదితర అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు.
మానవ శరీర నిర్మాణ శాస్త్రంపై ఉన్న ఆసక్తి కారణంగానే ఈ చర్యలకు పాల్పడ్డానని నిందితుడు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న అవశేషాలు ఎవరెవరివో గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన హంగేరీలో తీవ్ర సంచలనం రేపింది.