BREAKING
ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం
www.ntodaynews.com

మలద్వారంలో బంగారం.. జెడ్డా నుంచి అహ్మదాబాద్‌కు అక్రమ తరలింపు

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Aug, 2026 - 12:31 PM
4 వీక్షణలు

మలద్వారంలో బంగారం.. జెడ్డా నుంచి అహ్మదాబాద్‌కు అక్రమ తరలింపు

ఒంట్లోనే అరకిలో బంగారం.. ఎయిర్‌పోర్టులో అడ్డంగా బుక్కు!

అహ్మదాబాద్: బంగారం అక్రమ రవాణాకు కొందరు ఎంచుకుంటున్న మార్గాలు అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. తాజాగా జెడ్డా నుంచి అహ్మదాబాద్‌కు వచ్చిన ఓ యువకుడు దాదాపు అరకిలో బంగారాన్ని తన శరీరంలో దాచుకుని తరలించేందుకు ప్రయత్నించి విమానాశ్రయ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన అహ్మదాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అధికారుల వివరాల ప్రకారం.. ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో 24 ఏళ్ల సర్ఫరాజ్ మాలా జెడ్డా నుంచి అహ్మదాబాద్ చేరుకున్నాడు. విమానం దిగిన అనంతరం టెర్మినల్ నుంచి బయటకు వెళ్తుండగా అతడి ప్రవర్తనపై తనిఖీ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో అధికారులు అతడిని ఆపి లోహ గుర్తింపు పరికరంతో పరిశీలించారు. ఈ సందర్భంగా అతడి శరీరంలో లోహ పదార్థం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వైద్యుల సహాయంతో పరీక్షలు నిర్వహించగా అసలు విషయం బయటపడింది. బంగారాన్ని ప్రత్యేకంగా మలిచి మలద్వారంలో దాచుకుని దేశంలోకి తీసుకొచ్చేందుకు అతడు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. వైద్యుల సహకారంతో దాచిన బంగారాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 467.09 గ్రాముల బంగారం ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.65.69 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విమానాశ్రయంలో ఎన్ని తనిఖీలు ఉన్నప్పటికీ అక్రమ రవాణాదారులు కొత్త మార్గాలను ఎంచుకుంటుండటం అధికారులకు సవాలుగా మారుతోంది.