www.ntodaynews.com
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య.. ఒడిశా ప్రభుత్వ సంచలన నిర్ణయం
జాతీయం
ఒడిశా రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేస్తూ ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 38 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా చూడటం, డ్రాప్అవుట్లను తగ్గించడం, అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం వెల్లడించింది.
'కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య' పథకంతో విద్యా రంగంలో ఒడిశా ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచే అడుగు వేసింది.