www.ntodaynews.com
అయోధ్య విరాళాల చోరీ కేసు.. సిట్ దర్యాప్తు ముమ్మరం
జాతీయం
అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. అయోధ్య ట్రస్ట్కు సంబంధించిన గత ఐదేళ్ల ఆర్థిక లావాదేవీలపై రీ-ఆడిట్ చేపట్టాలని సిట్ నిర్ణయించింది. ట్రస్ట్లో ఉన్న నగదు నిల్వలు, విరాళాల లెక్కింపు ప్రక్రియ, నిధుల వినియోగంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
అలాగే ఆలయ నిర్మాణ పనులకు సంబంధించిన ఖర్చులు, టెండర్లు, చెల్లింపుల వివరాలను మరోసారి పరిశీలించనున్నట్లు సమాచారం. విరాళాల చోరీ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న సిట్ అధికారులు, సంబంధిత పత్రాలు, రికార్డులను స్వాధీనం చేసుకుని లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.