www.ntodaynews.com
ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ లేఖ..!
జాతీయం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వీవీబీ-జీ రామ్జీ చట్టంలో కొన్ని కీలక సవరణలు చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని హౌసింగ్ బోర్డు నిర్మాణాలను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా పథకం అమలులో భాగంగా వేతనాలు, పరిపాలనా వ్యయాలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాలని లేఖలో పేర్కొన్నారు. నిర్మాణ వ్యయాల భాగస్వామ్యాన్ని ప్రస్తుతం అమలులో ఉన్న విధానానికి బదులుగా కేంద్రం-రాష్ట్రం మధ్య 75:25 నిష్పత్తిలో అమలు చేయాలని విజయ్ కేంద్రాన్ని కోరారు.