BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

చాట్రాయిలో ఘనంగా 'వీబీజీరామ్‌జీ' పథకం ప్రారంభం.. గ్రామాభివృద్ధికి కూలీలే కీలకం : మోరంపూడి శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 03:35 PM
318 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలో కొత్తగా అమలులోకి వచ్చిన వికసిత్ భారత్ గారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీజీరామ్‌జీ) పథకాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు.

సూరన్న చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు, నక్కా రాము, కందుల కృష్ణ, అంబుడ్స్‌మన్ బాజీ, నక్కా సీతారత్నం కొబ్బరికాయలు కొట్టి పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా గ్రామీణ కూలీలు ఉపాధి పొందడంతో పాటు గ్రామాల అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించవచ్చని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని కూలీలకు సూచించారు.

అంబుడ్స్‌మన్ బాజీ మాట్లాడుతూ.. టీఏ, ఎఫ్‌ఏలు ఇచ్చిన కొలతల ప్రకారం పనులు పూర్తి చేసి గరిష్ఠ వేతనాలు పొందాలని కూలీలకు సూచించారు.

మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము మాట్లాడుతూ.. వీబీజీరామ్‌జీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో టీఏ కృష్ణ, ఎఫ్‌ఏ తాతయ్యబాబు, సీనియర్ మెట్లు, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.