www.ntodaynews.com
ఆదర్శ పాఠశాలలో విషాదం.. విధుల్లోనే టీచర్ ఐశ్వర్య మృతి
ఆంధ్రప్రదేశ్
/
అనంతపురం
అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకేషనల్ కోర్సు టీచర్గా పనిచేస్తున్న ఐశ్వర్య ప్రతిరోజులాగే విధులకు హాజరయ్యారు. అయితే అకస్మాత్తుగా అస్వస్థతకు గురై పాఠశాల ప్రాంగణంలోనే కుప్పకూలిపోయారు.
దీన్ని గమనించిన తోటి ఉపాధ్యాయులు వెంటనే ఆమెను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.
విధుల్లో ఉండగానే యువ ఉపాధ్యాయురాలు మృతిచెందడంతో పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఐశ్వర్య మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.