అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ల పంపిణీ.. చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో నిర్వహించిన వీబీజీ రామ్ జీ కార్యక్రమం అనంతరం ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లను చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందించే పౌష్టికాహారం నాణ్యతతో పాటు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం తయారయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించడం ద్వారా సిబ్బందికి పనిభారం తగ్గడంతో పాటు సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని తెలిపారు.
ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు.