BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

మోదీ మనోడేలే.. ఫోన్‌ కొట్టు!

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 07:33 AM
66 వీక్షణలు

ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాక ఆందోళన నెలకొన్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన స్నేహం మరోసారి చర్చనీయాంశమైంది.

భారత్-అమెరికా మిత్రమండలి సమావేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించిన ఓ ఆసక్తికర ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. మియామిలో జరిగిన ఓ సమావేశం మధ్యలోనే ట్రంప్‌ ఒక్కసారిగా "మోదీకి ఫోన్‌ చేయండి" అని తన సిబ్బందిని ఆదేశించారట.

అప్పటికే భారత్‌లో ఉదయం ఆరు గంటలు మాత్రమే అయ్యాయని అధికారులు గుర్తు చేయగా, "పర్వాలేదు... మోదీ ఎప్పుడైనా మాట్లాడటానికి సిద్ధంగానే ఉంటారు" అని ట్రంప్‌ చెప్పినట్లు సెర్గియో గోర్ వెల్లడించారు.

ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా నేతల మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటగా, అంతర్జాతీయ వేదికలపై నరేంద్ర మోదీ-డొనాల్డ్ ట్రంప్ స్నేహబంధం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.