BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ఈ రోజు BRS ఆఫీస్‌కు వెళ్తా.. సిద్ధంగా ఉండు కేటీఆర్! – మంత్రి జూపల్లి సవాల్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 09:23 AM
70 వీక్షణలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన సవాల్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు స్వీకరించారు. రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు.

గురువారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ కార్యాలయానికి స్వయంగా వస్తానని జూపల్లి వెల్లడించారు. చర్చకు కేటీఆర్ కూడా సిద్ధంగా ఉండాలని సూచించారు.

అంతేకాకుండా, ఈ అంశంలో కేటీఆర్ చెప్పిందే నిజమని తేలితే తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని జూపల్లి స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ సవాల్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

"మాటలతో కాదు... వాస్తవాలతో తేల్చుకుందాం. నేను ఈ రోజు BRS ఆఫీస్‌కు వస్తున్నా" అంటూ జూపల్లి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.