www.ntodaynews.com
ఈ రోజు BRS ఆఫీస్కు వెళ్తా.. సిద్ధంగా ఉండు కేటీఆర్! – మంత్రి జూపల్లి సవాల్
తెలంగాణ
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన సవాల్ను మంత్రి జూపల్లి కృష్ణారావు స్వీకరించారు. రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు.
గురువారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ కార్యాలయానికి స్వయంగా వస్తానని జూపల్లి వెల్లడించారు. చర్చకు కేటీఆర్ కూడా సిద్ధంగా ఉండాలని సూచించారు.
అంతేకాకుండా, ఈ అంశంలో కేటీఆర్ చెప్పిందే నిజమని తేలితే తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని జూపల్లి స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ సవాల్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
"మాటలతో కాదు... వాస్తవాలతో తేల్చుకుందాం. నేను ఈ రోజు BRS ఆఫీస్కు వస్తున్నా" అంటూ జూపల్లి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.