www.ntodaynews.com
ఉస్మానియా వైద్య బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు
తెలంగాణ
ఏకబిగిన 36 గంటలపాటు శ్రమించి ఓ రోగికి ఒకేసారి అయిదు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బందిని తెలంగాణ ముఖ్యమంత్రి అభినందించారు.
సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్కు జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు అవయవాలను ఒకేసారి మార్పిడి చేసి దేశంలోనే అరుదైన రికార్డును సృష్టించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
జాతీయ వైద్యుల దినోత్సవం రోజున ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందం ఈ అరుదైన ఘనత సాధించడం వైద్య వృత్తికి మరింత గౌరవాన్ని తీసుకువచ్చిందని, వైద్య రంగంలో తెలంగాణ ప్రతిష్ఠను మరింత పెంచిందని ఆయన ప్రశంసించారు.