www.ntodaynews.com
నేడు గాలివీడుకు కేంద్ర, రాష్ట్ర మంత్రుల రాక
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేడు అన్నమయ్య జిల్లా గాలివీడుకు రానున్నారు.
గాలివీడులోని శ్రీనాథ్ కళ్యాణ మండపంలో నిర్వహించనున్న వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో వారు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారికి ఘన స్వాగతం పలకనున్నారు.
కేంద్ర, రాష్ట్ర మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని కోరుతూ టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.