www.ntodaynews.com
డెంగీపై అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ శేఖర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం రాయవరం ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ డెంగీ నివారణ మాసోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగీ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూలర్లు, పూల కుండీలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమతెరలు ఉపయోగించాలని తెలిపారు. ఆకస్మిక జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.