www.ntodaynews.com
కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ రాక.. ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్
కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గవర్నర్కు స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, విశ్వవిద్యాలయ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రథమ స్నాతకోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయ ప్రాంగణం ప్రత్యేకంగా అలంకరించబడగా, విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.