BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

ఆధారాలు లేకుండా ఆరోపిస్తే కఠిన చర్యలు: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 12:24 AM
57 వీక్షణలు

అమరావతి, జూలై 1: సోషల్ మీడియాలో ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించబోమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారం, అసత్య ఆరోపణలు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

వ్యక్తి స్వేచ్ఛ అంటే ఇతరులను అవమానించడం లేదా వ్యక్తిగత హననానికి పాల్పడటం కాదని పేర్కొన్నారు. కొందరు దేవుళ్లపై, మత విశ్వాసాలపై ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యక్తిగత దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు సమాజానికి మంచిది కాదని, మత విశ్వాసాలను దెబ్బతీయడం ఎట్టి పరిస్థితుల్లోనూ హక్కు కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆయన సూచించారు.