BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ప్రభుత్వ ఉద్యోగి అవినీతి.. రాజ్య వ్యతిరేక నేరమే: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 12:24 AM
75 వీక్షణలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులు చేసే అవినీతి చర్యలను రాజ్యానికి, సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరాలుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డబ్బులు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో నిందితులతో బాధితులు రాజీ కుదుర్చుకున్నారనే కారణంతో కేసును కొట్టివేసిన మద్రాసు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది.

ఈ కేసును విచారించిన ద్విసభ్య ధర్మాసనం, హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ నిందితులపై క్రిమినల్ ఫిర్యాదును తిరిగి పునరుద్ధరించాలని ఆదేశించింది.

ప్రభుత్వ ఉద్యోగాలను డబ్బులతో కొనుగోలు చేసిన వ్యక్తులు, ఆ మొత్తాన్ని తిరిగి సంపాదించుకునేందుకు అవినీతికి పాల్పడే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ప్రజలే పరోక్ష బాధితులవుతారని, అందువల్ల ఇలాంటి కేసుల్లో నిందితులను ఉపేక్షించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అవినీతి ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే తీవ్రమైన నేరమని, రాజీ పేరుతో ఇలాంటి కేసులను మూసివేయడం సమంజసం కాదని ధర్మాసనం పేర్కొంది.