BREAKING
గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం
www.ntodaynews.com

ప్రభుత్వ ఉద్యోగి అవినీతి.. రాజ్య వ్యతిరేక నేరమే: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 12:24 AM
0 వీక్షణలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులు చేసే అవినీతి చర్యలను రాజ్యానికి, సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరాలుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డబ్బులు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో నిందితులతో బాధితులు రాజీ కుదుర్చుకున్నారనే కారణంతో కేసును కొట్టివేసిన మద్రాసు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది.

ఈ కేసును విచారించిన ద్విసభ్య ధర్మాసనం, హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ నిందితులపై క్రిమినల్ ఫిర్యాదును తిరిగి పునరుద్ధరించాలని ఆదేశించింది.

ప్రభుత్వ ఉద్యోగాలను డబ్బులతో కొనుగోలు చేసిన వ్యక్తులు, ఆ మొత్తాన్ని తిరిగి సంపాదించుకునేందుకు అవినీతికి పాల్పడే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ప్రజలే పరోక్ష బాధితులవుతారని, అందువల్ల ఇలాంటి కేసుల్లో నిందితులను ఉపేక్షించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అవినీతి ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే తీవ్రమైన నేరమని, రాజీ పేరుతో ఇలాంటి కేసులను మూసివేయడం సమంజసం కాదని ధర్మాసనం పేర్కొంది.