పూరీ జగన్నాథ రథయాత్రకు ముహూర్తం.. ఈనెల 16న ప్రారంభం
ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరిగే ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ జగన్నాథ రథయాత్ర ఈనెల 16న ప్రారంభం కానుంది. ఆషాఢ మాస శుక్ల పక్ష విదియ తిథి సందర్భంగా ఈ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
జూలై 16, గురువారం నుంచి 24వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలను ప్రత్యేకంగా అలంకరించి రథాలపై ఊరేగిస్తారు.
ప్రధాన ఆలయం నుంచి గుండిచా మందిరం (మేనత్త ఇల్లు) వరకు ఈ పవిత్ర రథయాత్ర సాగుతుంది. లక్షలాది మంది భక్తులు రథాలను లాగడం ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
జూలై 24న బహుదా యాత్రతో స్వామివారి తిరుగు ప్రయాణం పూర్తవడంతో రథోత్సవం ముగియనుంది.
ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు పూరీ క్షేత్రానికి తరలిరానున్నారు. దీంతో పూరీ నగరం ఇప్పటికే భక్తజన సందోహంతో కళకళలాడుతోంది.