BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

పూరీ జగన్నాథ రథయాత్రకు ముహూర్తం.. ఈనెల 16న ప్రారంభం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 12:24 AM
30 వీక్షణలు

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరిగే ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ జగన్నాథ రథయాత్ర ఈనెల 16న ప్రారంభం కానుంది. ఆషాఢ మాస శుక్ల పక్ష విదియ తిథి సందర్భంగా ఈ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

జూలై 16, గురువారం నుంచి 24వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలను ప్రత్యేకంగా అలంకరించి రథాలపై ఊరేగిస్తారు.

ప్రధాన ఆలయం నుంచి గుండిచా మందిరం (మేనత్త ఇల్లు) వరకు ఈ పవిత్ర రథయాత్ర సాగుతుంది. లక్షలాది మంది భక్తులు రథాలను లాగడం ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

జూలై 24న బహుదా యాత్రతో స్వామివారి తిరుగు ప్రయాణం పూర్తవడంతో రథోత్సవం ముగియనుంది.

ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు పూరీ క్షేత్రానికి తరలిరానున్నారు. దీంతో పూరీ నగరం ఇప్పటికే భక్తజన సందోహంతో కళకళలాడుతోంది.