BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

పూరీ జగన్నాథ రథయాత్రకు ముహూర్తం.. ఈనెల 16న ప్రారంభం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 12:24 AM
64 వీక్షణలు

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరిగే ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ జగన్నాథ రథయాత్ర ఈనెల 16న ప్రారంభం కానుంది. ఆషాఢ మాస శుక్ల పక్ష విదియ తిథి సందర్భంగా ఈ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

జూలై 16, గురువారం నుంచి 24వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలను ప్రత్యేకంగా అలంకరించి రథాలపై ఊరేగిస్తారు.

ప్రధాన ఆలయం నుంచి గుండిచా మందిరం (మేనత్త ఇల్లు) వరకు ఈ పవిత్ర రథయాత్ర సాగుతుంది. లక్షలాది మంది భక్తులు రథాలను లాగడం ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

జూలై 24న బహుదా యాత్రతో స్వామివారి తిరుగు ప్రయాణం పూర్తవడంతో రథోత్సవం ముగియనుంది.

ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు పూరీ క్షేత్రానికి తరలిరానున్నారు. దీంతో పూరీ నగరం ఇప్పటికే భక్తజన సందోహంతో కళకళలాడుతోంది.