ఆపన్నులకు అండగా సీఎం సహాయ నిధి.. చింతలపూడిలో 25 మందికి రూ.14.13 లక్షల చెక్కుల పంపిణీ
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
చింతలపూడి: ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) మరోసారి పలువురి జీవితాల్లో వెలుగులు నింపింది. బుధవారం చింతలపూడి క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చేతుల మీదుగా 25 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.14,13,618 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ, అనారోగ్యం, ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసా కల్పిస్తోందన్నారు. ప్రజల కష్టసుఖాల్లో ప్రభుత్వం భాగస్వామిగా నిలుస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా నేరుగా ప్రజల జీవితాలను మార్చే విధంగా అమలవుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. లబ్ధిదారులు కూడా సీఎం సహాయ నిధి తమకు అత్యంత క్లిష్ట సమయంలో పెద్ద అండగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు