BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

అధికారుల స్పందనతో నిరాహార దీక్ష వాయిదా..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
02 Jul, 2026 - 08:37 AM
21 వీక్షణలు

 | NTODAY NEWS

అన్నమయ్య జిల్లా పుంగనూరులోని పుంగమ్మ చెరువుకట్ట నుంచి బెంగళూరు వెళ్లే రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకటించిన నిరాహార దీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సామాజికవేత్త అయూబ్ ఖాన్ తెలిపారు.

రెండు రోజుల క్రితం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రహదారి పనులు పూర్తి చేయకపోతే నాలుగు రోజులలోపు నిరాహార దీక్ష చేపడతామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో రోడ్డు సమస్యపై ఆర్ అండ్ బి (R&B) అధికారులు స్పందించారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఆదివారం లోపు రహదారి పనులను ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారని, ఆ హామీపై విశ్వాసంతో ప్రస్తుతం నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

అయితే అధికారులు ఇచ్చిన గడువులోగా పనులు ప్రారంభించకపోతే ప్రజల తరఫున మరింత ఉధృతంగా ఆందోళన చేపడతామని అయూబ్ ఖాన్ హెచ్చరించారు.