అధికారుల స్పందనతో నిరాహార దీక్ష వాయిదా..
| NTODAY NEWS
అన్నమయ్య జిల్లా పుంగనూరులోని పుంగమ్మ చెరువుకట్ట నుంచి బెంగళూరు వెళ్లే రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకటించిన నిరాహార దీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సామాజికవేత్త అయూబ్ ఖాన్ తెలిపారు.
రెండు రోజుల క్రితం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రహదారి పనులు పూర్తి చేయకపోతే నాలుగు రోజులలోపు నిరాహార దీక్ష చేపడతామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో రోడ్డు సమస్యపై ఆర్ అండ్ బి (R&B) అధికారులు స్పందించారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఆదివారం లోపు రహదారి పనులను ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారని, ఆ హామీపై విశ్వాసంతో ప్రస్తుతం నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
అయితే అధికారులు ఇచ్చిన గడువులోగా పనులు ప్రారంభించకపోతే ప్రజల తరఫున మరింత ఉధృతంగా ఆందోళన చేపడతామని అయూబ్ ఖాన్ హెచ్చరించారు.