www.ntodaynews.com
అక్రమ రిజిస్ట్రేషన్లు జరగలేదు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్లు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
అక్రమ రిజిస్ట్రేషన్లు జరగలేదు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్లు: ఆర్డీఓ కుమార్
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం
గంపలగూడెం మండలం తోటమూల గ్రామ పరిధిలోని (పెద్దకొమెర రెవెన్యూ) ప్రభుత్వ భూమికి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయనే ఆరోపణల్లో వాస్తవం లేదని తిరువూరు ఆర్డీఓ కుమార్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, సదరు భూమిలో ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న అర్హులైన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగలేదని ఆర్డీఓ పేర్కొన్నారు.