చిట్యాల మండలం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
చిట్యాల మండలం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా 95-నకిరేకల్ (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండలానికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం చిట్యాల తహసిల్దార్ విజయ్ కుమార్ విడుదల చేశారు. మండలంలోని మొత్తం 55 పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత బూత్ లెవెల్ అధికారులు జాబితాను ప్రచురించారు. చిట్యాల మండలంలో మొత్తం 44,770 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 22,256 మంది పురుషులు, 22,513 మంది మహిళలు, ఒకరు ఇతరులు ఉన్నట్లు తహశీల్దారు తెలిపారు. ఓటర్లు తమ పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయో లేదో సంబంధిత పోలింగ్ కేంద్రంలో, బి ఎల్ ఓల వద్ద లేదా ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ ద్వారా పరిశీలించుకోవాలని సూచించారు. అర్హత ఉన్న వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారమ్-6, ఓటరు పేరు తొలగింపునకు ఫారమ్-7, ఓటరు వివరాల్లో మార్పులు, చిరునామా మార్పు, ఫొటో తదితర సవరణల కోసం ఫారమ్-8 సమర్పించవచ్చని తెలిపారు. దరఖాస్తులను సంబంధిత బి.ఎల్.ఓలకు లకు, ఆన్లైన్ ద్వారా ఎన్నికల సంఘం వెబ్సైట్ల ద్వారా ఏ ఈ ఆర్ ఓ, ఈఆర్ఓ అధికారులకు సమర్పించవచ్చని చిట్యాల తహశీల్దారు విజయ్ కుమార్ పేర్కొన్నారు.